అసభ్య కామెంట్లతో బెదిరిస్తున్నారని టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ కోల్ కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుమార్తెకు భద్రత కల్పించాలని కోరారు. తాను ఇప్పటికే నిస్సహాయురాలినైపోయానని, తనను అభద్రతాభావం వెంటాడుతోందని చెప్పారు.
తమకు భద్రతను కల్పించలేకపోతే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో హసీన్ గ్రీటింగ్స్ తెలిపారు. దీంతో, కొందరు ఆమె పట్ల అత్యాచారం చేసి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ప్రస్తుతం షమీ, హసీనా ఇద్దరూ విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే.