బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్కు వరుసకు సోదరి అయిన నూర్జహాన్ పాకిస్తాన్లోని పెషావర్లో కన్నుమూశారు. సమాచారం ప్రకారం నూర్జహాన్ సోదరుడు మన్సూర్ అహ్మద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కొంతకాలంగా నూర్జహాన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. పెషావర్లోని షావాలీ కతల్లో ఉంటున్న ఆమె స్థానిక నగర పరిషత్లో ఒకప్పుడు సభ్యురాలిగా ఉండేవారు. నూర్జహాన్ తన సోదరుడు షారూఖ్ ఖాన్ను కలుసుకునేందుకు భారత్కు రెండుసార్లు వచ్చారు. అలాగే షారూఖ్ ఖాన్, నూర్జహాన్ కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో షారూఖ్ ఖాన్ కూడా వారిని కలుసుకునేందుకు రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లారని సమాచారం.
previous post
నన్ను అక్రమ సంబంధం పెట్టుకునేవాడిగానే చూస్తున్నారు… హీరో ఆవేదన