telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్ పార్టీలో ప్రమాదం… రిస్క్ చేసి ఐశ్వర్యారాయ్ మేనేజర్ ను కాపాడిన షారుఖ్

Sharukh

ఆదివారం అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ఇంట్లో దీపావ‌ళి పార్టీ ఏర్పాటు చేయ‌గా ఈ కార్య‌క్ర‌మానికి షారూఖ్ ఖాన్, ఆమె భార్య గౌరీ ఖాన్, విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌, రిషి క‌పూర్, నీతూ సింగ్‌, ప‌రిణితీ చోప్రా, అక్ష‌య్ కుమార్, షాహిద్ క‌పూర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అయితే అంద‌రు పార్టీని ఎంజాయ్ చేస్తున్న స‌మ‌యంలో ఐష్ మేనేజ‌ర్ అర్చ‌న స‌దానంద్ లెహంగాకి మంట‌లు అంటుకున్నాయి. వెంట‌నే స్పందించిన షారూఖ్ త‌న జాకెట్‌తో మంటలు ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌మాదంలో అర్చ‌న కుడికాలుతో పాటు చేతులు 15% మంట‌ల‌లో కాలాయి. ఆమెని కాపాడే ప్ర‌య‌త్నంలో షారూఖ్‌కి కూడా చిన్న‌పాటి గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. ఆదివారం తెల్ల‌వారుజామున 3గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంటనే అర్చ‌న‌ని ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. ఐసీయూలో చికిత్స అందిస్తుండ‌గా, ప‌రామ‌ర్శించేందుకు ఎవ‌రిని అనుమ‌తించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య‌ప‌రిస్థితి మెరుగ్గానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న‌ట్టు తెలుస్తుండ‌గా, మ‌రో మూడు నాలుగు రోజుల‌లో అర్చ‌నని డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ట‌. అర్చ‌న ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఐశ్వ‌ర్య‌రాయ్‌కి మేనేజ‌ర్‌గా ప‌ని చేస్తూ వ‌స్తుంది. బాలీవుడ్ బాద్‌షా రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరో అనిపించాడు. రిస్క్ చేసి ఐష్ మేనేజ‌ర్‌ని మంట‌ల నుండి కాపాడాడు.

Related posts