ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హిందీ, తెలుగు, తమిళం… ఇలా భాషలతో సంబంధం లేకుండా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి సంబంధించి ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు రూపొందాయి. తాజాగా ప్రపంచ మహిళా క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత నేపథ్యంలో చిత్రం రూపొందుతుంది. సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన మిథాలీ ఇటీవల టీ 20లకి గుడ్ బై చెప్పింది. 2018లో ఆమె జట్టు తరఫున కీలకంగా వ్యవహరించారు.ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చేందుకు వయాకామ్ 18 సంస్థ సన్నాహాలు చేస్తుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. “శభాష్ మిథు” పేరుతో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శభాష్ మిథు అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఇందులో తాప్సీ .. మిథాలీ పాత్రలో ఒదిగిపోయింది. స్టైలిష్ షాట్ కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. 2021 మేలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా పేర్కొన్నారు.
previous post
next post