ప్రమాదవశాత్తు గోడ కూలడంతో ఏడేళ్ల చిన్నారి మరణించింది.బాగ్ లింగంపల్లి సంజయ్ నగర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల చిన్నారి మరణించడంతో పాటుగా మరో బాలికకు వృద్ధురాలికి గాయాలయ్యాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లో ఈ సంఘటన జరిగింది. సంజయ్ నగర్ లో జయ కృష్ణ అనే వ్యక్తి కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు పురాతన ఇంటిని కూల్చి వేస్తున్నాడు. కానీ రెండు రోజుల క్రితం కూల్చివేత పనులు ఆపేసారు. కానీ ఇంటి ముందున్న ఇటుకల వల్ల దారిలో రాకపోకలకు ఇబ్బంది అవుతుందని జయ కృష్ణ తల్లి విజయలక్ష్మి, ఆయన ఇద్దరు కూతుర్లు దివ్య, జయశ్రీ వాటిని తొలగిస్తున్నారు. కానీ అప్పుడే ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా ప్రక్కన ఉన్న గోడ కూలడంతో ‘జయశ్రీ’ అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే విజయలక్ష్మి, దివ్యలకు గ్యాలు కావడంతో వారిని విద్యా నగర్ లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని చిక్కడపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చనిపోయిన జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
previous post
next post