telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురు అరెస్ట్…

హైదరాబాదులో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన ఈ బెట్టింగ్ ఆగడం లేదు. తాజగా హైదరాబాదులో రాజస్థాన్ ఏటీఎస్ టీమ్ సోదాలు చేసింది. ఈ సోదాల్లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసింది రాజస్థాన్ ఏటీఎస్. తెలంగాణ , ముంబై , ఢిల్లీ, రాజస్థాన్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నడుస్తుందని గుర్తించారు అధికారులు. దేశవ్యాప్తంగా ఈ ముఠా పెద్దమొత్తంలో బెట్టింగ్ పాల్పడుతున్నది.

ఈ సోదాల్లో ఏడుగురు సభ్యుల నుంచి 16 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్ కు ఈ ముఠా పాల్పడుతున్నది. ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేష్ ను పట్టుకున్న పోలీసులు…గణేష్ తో పాటు.. సురేష్ , పంకజ్, సత్తయ్య తో పాటు మరో ముగ్గురు అరెస్టు చేసారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్ ఇదే అని పోలీసులు గుర్తించారు. అన్ని రాష్ట్రాల్లో ముఠాలను ఏర్పాటుచేసి గణేష్ బెట్టింగ్ నడుపుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు.

Related posts