telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

తూ.గో. జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా.. ఆరుగురు మృతి

Accident

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాటికొండ ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా పడడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. వీరిలో పలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు రాజముండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో 17 మంది ప్రయాణికులున్నారు. తాటికొండలో వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదం రాత్రి 3 గంటలకు చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఘటన స్థలానికి చేరుకున్నారు. తాటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్డు లో పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా..ఒకరు ఆస్పత్రికి వెళ్ళగానే మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎందుకు చేరింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం డ్రైవర్ తప్పిదం వల్లే జరిగిందని అందరు అనుకుంటున్నారు. 

Related posts