telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

AP

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతాధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ చేస్తూ  సోమవారం ప్రభుత్వం  ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారు.. నర్సీంపట్నం ఏఎస్పీగా రిషాంత్‌ రెడ్డి, రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్‌ హఫీజ్‌, రంపచోడవరం ఏఎస్పీగా వకుల్‌ జిందాలు ఉన్నారు. వీరితో పాటు గ్రేహోండ్స్‌ స్వ్కాడ్రన్‌ కమాండర్‌గా రాహుల్‌ దేవ్‌ సింగ్‌, విశాఖపట్నం అదనపు ఏఎస్పీ అడ్మిన్‌గా అజితా వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్‌వన్‌గా గౌతమి శాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్‌ వన్‌గా సుమిత్‌ సునీల్‌ బదిలీ అయ్యారు.
 

Related posts