ఏపీలో ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. అయితే, సాంకేతిక కారణాలతో సర్వర్లు మొరాయించడంతో విద్యార్థులు ఫలితాలు చూసుకోలేక తీవ్ర నిరాశకు గురయ్యారు.
సర్వర్ బిజీ అని, టూ మెనీ హిట్స్ అని సందేశాలు రావడం తప్ప ఫలితాలు రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. రెండు సంవత్సరాలు ఫలితాలు ఒకేసారి విడుదల చేయడమే సర్వర్ల మొరాయింపుకు కారణం అని భావిస్తున్నారు.