సోమాలియా మరోసారి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతో పాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి ఘటన అధ్యక్ష భవనం సమీపంలోని తనిఖీ కేంద్రం వద్ద జరిగిందన్న అధికారులు.. ఎనిమిది మంది చనిపోయారని వెల్లడించారు.
రెండో ఘటన ఫోర్ట్ఫీల్డ్ విమానాశ్రయం సమీపంలోని తనిఖీ కేంద్రం వద్ద సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో వ్యక్తి మరణించారు. బాంబు పేలుళ్లకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా అల్ షబాబ్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.