telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

9 పరుగులకు .. పది వికెట్లు.. మరీ ఇంత ఆసక్తి ఉంటె కష్టం!!

senior women cricket league t20

అత్యంత తక్కువ స్కోర్ తో ఇటీవల టీమిండియా-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 92 పరుగులకు ఆలౌట్‌ అయితేనే చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. తాజాగా సీనియర్‌ ఉమెన్స్‌ టీ20 లీగ్‌లో భాగంగా మిజోరం-మధ్యప్రదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మిజోరం మహిళా జట్టు కేవలం 9 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేవలం ఒక్క బ్యాట్స్‌ ఉమెన్‌ మాత్రమే ఈ పరుగులైనా చేయగలిగింది.

ఓపెనర్లు, మూడు, నాలుగు స్థానాల్లో వచ్చిన బ్యాట్స్‌ఉమెన్లు డకౌట్‌ అయ్యారు. ఐదో నంబరు బ్యాట్స్‌ ఉమెన్‌గా బరిలోకి దిగిన అపూర్వ భరద్వాజ్‌ క్రీజులోకి వచ్చిన తర్వాత ఆరు పరుగులు చేసింది. అపూర్వ 24 బంతులను ఎదుర్కొని 25 బంతిని భారీ షాట్ కొట్టడంతో ఆ మాత్రం పరుగులైనా వచ్చాయి. ఆ తర్వాతి బంతికే ఆమె కూడా ఔట్‌ అయింది. అపూర్వ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవరూ ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడంతో 9 పరుగులు చేసి మిజోరం జట్టు ఆలౌట్‌ అయింది. అయితే బుధవారం కేరళతో జరిగిన మ్యాచ్‌లోనూ మిజోరం జట్టు 24 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

Related posts