మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సంతోష్ నాయక్పై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. మనస్థాపంతో స్వగ్రామానికి వెళ్లిన సంతోష్ నాయక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ర్యాగింగ్పై పలుమార్లు కళాశాల యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు గమనించి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంతోష్ జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంతోష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
మూడు ముక్కలాట ఎందుకు ఆడుతున్నారు: చంద్రబాబు ఫైర్