నటి శివ పార్వతి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ సమయంలో ఆమె పడ్డ మానసిక సంఘర్షణను తెలియజేస్తూ ఆమె ఓ ఎమోషన్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. “అందరికి నమస్కారం.. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. పది రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాను. అక్కడ కరోనా నుంచి కోలుకొని నిన్న రాత్రి ఇంటికి చేరాను. ఈ మధ్యలో రెండు ఆసుపత్రులు మారాను.. కరోనా సోకిన విషయాన్ని వదినమ్మ సీరియల్ యూనిట్ కి వెల్లడించాను.. కానీ నా గురించి ఎవరూ ఏ ఆస్పత్రిలో ఉన్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? అని అడగలేదు. ఇది దురదృష్టం. అంటే ఎవరి సమస్య వాళ్లదే.. ఇక్కడ ఎవరికి ఎవరూ తోడుండరు… నేను గత 5 ఏళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా పరిస్థితి తెలుసుకుని జీవిత రాజశేఖర్ సహాయం చేశారు. ప్రభాకర్ గారూ ఈ వైరస్ నోట్లో నుంచి వెళ్లి కింద నుంచి వచ్చేస్తుందని చెప్పారు.. రెండు లక్షలు సరిపోదు.. పది లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోండి అన్నారు. అది నేను చేసుకోలేకపోయాను. కాని ప్రొడక్షన్స్ నుంచి ఇన్సూరెన్స్ చేశాం అని చెప్పారు. కాని క్లైమ్ చేసుకోమని చెప్పడం కూడా చేయలేరా? మీ అందరికీ నేను థాంక్స్ చెప్తున్నా. నేను పోయానని తెలిసినా ఇంతే రెస్పాన్స్ అవుతారు. ఎవరికీ తెలియనివ్వకుండా కామ్గా షూటింగ్ కానిచ్చేస్తారు” అని ఆమె భాగోద్వేగానికి లోనయ్యారు. శివపార్వతి పలు తెలుగు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.. ప్రస్తుతం సీరియల్స్లలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న వదినమ్మ సీరియల్ బాగా పాపులర్ అయింది
previous post