డ్రగ్స్ కేసులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ముందుగా తనకు ఎన్సీబీ నుంచి సమన్లు అందలేదని బుకాయించిన రకుల్.. చివరకు శుక్రవారం రోజు ముంబై చేరుకొని ఎన్సీబీ విచారణలో పాల్గొంది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో రకుల్పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆమెకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలపై కూపీ లాగారట ఎన్సీబీ అధికారులు. అయితే డ్రగ్ చాట్స్ మాత్రం చేసినట్లు అంగీకరించిన రకుల్.. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ మాఫియాతో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పినట్లు సమాచారం. అలాగే రియాతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు, రియా కోరిన మేరకు తన ఫ్లాట్లో డ్రగ్స్ దాచినట్టు రకుల్ అంగీకరించిందట. ఇక ఈ విచారణలో భాగంగా ఆమె మరో నలుగురి పేర్లు బయటపెట్టిందని తెలుస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. క్షితిజ్ రవి ప్రసాద్ అనే వ్యక్తి తన స్నేహితులకు డ్రగ్స్ సరఫరా చేశాడని రకుల్ వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. క్షితిజ్ నుంచి డ్రగ్స్ తీసుకున్న నలుగురు సెలబ్రిటీల పేర్లను కూడా రకుల్ బయటపెట్టిందని తెలుస్తుండటంతో సినీ వర్గాలు వణికిపోతున్నాయి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్కు క్షితిజ్ అత్యంత సన్నిహిత వ్యక్తి అని తెలుస్తున్న నేపథ్యంలో కరణ్ను కూడా ఎన్సీబీ అధికారులు విచారణకు పిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పైన పేర్కొన్నట్టు రకుల్ స్టేట్మెంట్ ఇవ్వడం నిజమైతే రకుల్ అరెస్ట్ తప్పదని ప్రముఖ న్యాయవాది ఒకరు వెల్లడించారు. ఎన్డీపీఎస్ చట్టం 8(సి) ప్రకారం డ్రగ్స్ను దాచడం పెద్ద నేరమని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వాడడం కంటే ఇది పెద్ద నేరమని ఆయన పేర్కొన్నారు. కాగా, రకుల్ ముంబై వెళ్లినప్పుడల్లా రియాతోనే కలిసి తిరిగేదని, ఆమెతో కలిసి పార్టీలకు, పబ్బులకు వెళ్లేదని తెలుస్తోంది. రకుల్కు ఈ స్థితి రావడానికి రియాతో స్నేహమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నా రేటు డిసైడ్ చేయడానికి ఆ హీరో ఎవరు..? : తాప్సి ఫైర్