టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని నానక్రామ్గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్కు తరలిస్తారు. శుక్రవారం మహా ప్రస్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు.
కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు భౌతికకాయానికి నివాళులర్చించేందుకు తరలివస్తున్నారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికాయాన్ని ఫిలించాంబర్లో కొంత సమయం ఉంచిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విజయనిర్మల మరణంలో ఈ రోజు జరగాల్సిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు రేపు జరగాల్సిన మహర్షి 50 రోజుల వేడుకలను క్యాన్సిల్ చేశారు. విజయనిర్మల మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.