telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కాంగ్రెస్ సీనియర్ నేత.. టీడీపీలోకి..

senior congress leader into tdp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజుకో మార్పు చోటుచేసుకుంటుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలలో ఇంకా చేరికలు జరుగుతూనే ఉన్నాయి. నేడో, రేపో అభ్యర్థుల పూర్తి జాబితా కూడా విడుదల కానున్న ఈ సమయంలో కూడా పార్టీ ఫిరాయింపులు జరుగుతుండటం అక్కడి రాజకీయ అణిచితిని స్పష్టమైన నిదర్శనం. తాజాగా, సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఆమె కుటుంబం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం స్వయంగా వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక నిన్నటి రాత్రి టీడీపీ తన తొలిజాబితా విడుదల చేసింది. దీనిలో 126మందికి చోటు దక్కింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, తన జాబితా తానే స్వయంగా సిద్ధం చేసుకున్నది, ఇక జగన్ జాబితా అటు కేసీఆర్ ఇటు మోడీ కలిసి తయారుచేసింది. కనుక జగన్ కి ఓటు వేస్తె మోడీకి వేసినట్టే, అలా జరిగితే రాష్ట్రానికి మరో ఐదేళ్లు అవమానాలు, ఇబ్బందులు తప్ప మరేమి మిగలవని అన్నారు. ఈ ఎన్నికలలో ఆత్మగౌరవం ప్రధాన అంశం కాబోతున్నాడని, టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నదని అన్నారు.

Related posts