telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో మరో విషాదం

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. త్రివిక్రమ్, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్ గా పని చేసిన సత్యం…ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. సై సినిమాకు చీఫ్ కో డైరెక్టర్ గా పని చేసిన సత్యం.. ఆ తర్వాత శ్రీరామదాస్, చందమామ సినిమాలకు కో డైరెక్టర్ గా చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర, మర్యాద రామన్న సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ కూడా వ్యవహరించారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి పరిశ్రమ హిట్ దక్కించుకున్న ఆలా వైకుంఠపురంలో సినిమాకు కూడా కో డైరెక్టర్ గా సత్యం పని చేశారు. త్రివిక్రమ్ తో పాటు దర్శకులందరికి కూడా ఆప్తుడిగా పేరు దక్కించుకున్న సత్యం మృతి పరిశ్రమ వర్గాల్లో విషాదం నింపింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. అటు హీరోయిన్ పూజ హెగ్డే కూడా.. సత్యం మృతి పట్ల ఎమోషనల్ అయ్యారు.

Related posts