తెలుగు వెండితెరపై అగ్రకథానాయికగా వెలుగొందిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 13 ఏళ్ల తరువాత ఆమె మళ్లీ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో నటించబోతున్నారు. సూపర్స్టార్ కృష్ణ జన్మదినోత్సం సందర్భంగా ఈ రోజు (శుక్రవారం) ఆ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయశాంతి ప్రెస్నోట్ విడుదల చేశారు. “సూపర్స్టార్ కృష్ణగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నా తెలుగు మొదటి సినిమా `కిలాడి కృష్ణుడు`లో హీరో సూపర్స్టార్ కృష్ణగారు. ఆ తర్వాత 180 సినిమాలు చేశాను. రాజకీయాల కారణంగా 13 ఏళ్లు సినిమాలకు దూరమయ్యాను. ఇప్పుడు మళ్లీ రీ-ఎంట్రీ సినిమాలో సూపర్స్టార్ మహేష్బాబుగారితో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని విజయశాంతి తెలిపారు.
previous post
next post
కుందేలు అని శ్రీముఖిని అనలేదు : నోయెల్