బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ వాడినట్లు, డ్రగ్స్ పెడల్స్తో తనకు కాంటాక్ట్స్ ఉన్నట్లు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఒప్పుకోగా… రియా చక్రవర్తి వాంగ్మూలం మేరకు మరికొందరు బాలీవుడ్ తారలకు నోటీసులు ఇచ్చేందుకు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్సీబీ) సిద్ధమవుతోంది. వారిలో నటి దీపికా పదుకొనే, ఆమె మేనేజింగ్ ఏజెన్సీకి చెందిన కరిష్మా, బాలీవుడ్ తారలు రకుల్ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా ఉన్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా విలేకరులకు చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఓ ప్రముఖ హీరోపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షాక్ కు గురి చేస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరోయిన్ కునికా సదానంద్ మాట్లాడుతూ.. బాలీవుడ్ ప్రముఖుల పార్టీల్లో డ్రగ్స్ అనేవి సర్వసాదారణం అంటూ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ గతంలో డ్రగ్స్ తీసుకునే వారు. అయితే అది ఆయన సినిమాలపై లేదా పనిపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఆయన చూసుకునేవారు అంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలకు జాకీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
previous post