telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రుద్రమదేవి”ని అలా వదులుకున్నాను : విజయశాంతి

Vijaya

సీనియన్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత ఆమె ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా… కర్తవ్యం సినిమా తర్వాత విజయశాంతి ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇదే తరహా సినిమాలు ఎక్కువ రావడంతో జనాలకు బోర్ కొట్టడంతో ఆమె కెరీర్ అయోమయ పరిస్థితిలో పడిపోయింది. దాంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. మొదట బీజేపీలో చేరిన ఆమె తర్వాత టీఆర్ఎస్ లో కొనసాగారు. తాజాగా విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గతంలో తాను రుద్రమదేవి మూవీలో నటించాలని ప్లాన్ చేశానని, ఎందుకంటే ఒకవేళ సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఓ పవర్ ఫుల్ పాత్రలో పవర్ ఫుల్ సినిమాతో రావాలని అనకున్నానని, అది కూడా నా సొంత బ్యానర్ పైనే నిర్మించాలనే ఉద్దేశంతో పరిశోధనలు పూర్తి చేసి కథను సిద్ధం చేసుకున్నామని, కానీ అదే సమయంలో రాజకీయాల్లో అవకాశం రావడంతో అటువైపు వెళ్లానని అన్నారు. రాజకీయాలలో బిజీ కావడంతో, మరో వైపుకు దృష్టి మళ్లించకూడదనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయడం జరిగింది అని చెప్పుకొచ్చారు.

Related posts