telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ప్రాణం మీదకు తెచ్చిన .. తుపాకీతో-సెల్ఫీ మోజు..

selfie with gun mis fired women hospitalized

సినిమాలు చూసి కొత్తకొత్త పోకడలు చూస్తూనే ఉన్నాం. తమ ఇష్టమైన నటుల పోలికతో అలంకరణ లేదా వారు వాడే ఇతరత్రా వస్తువులు వాడుతుండటం… లాంటివి అందరూ చేస్తూండేవే.. అయితే సినిమాలలో వాడే ఆయుధాలతో కూడా అదే తరహాలో సరదాపడితే .. దూలతీరిపోద్ది అని మరోసారి రుజువైంది. అవి సినిమాలు.. అంటే ఊహలు అంతవరకే గాని వాటిని అనుకరించరాదు. మంచి ఉన్న కూడా, బాగా పరిశీలించాకే పాటించాలి. లేదంటే ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్టే. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఘటన ఇందుకు ఒక ఉదాహరణ.. స్థానిక దుర్గానగర్‌కు చెందిన జాన్వి (23)- విశ్వజిత్ తోమర్‌లు భార్యాభర్తలు. ఏడాది క్రితం వీరికి వివాహమైంది. సైన్యంలో పనిచేసే విశ్వజిత్ తండ్రి సుభాష్‌ను కలిసేందుకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను భద్రంగా దాచిపెట్టాలంటూ సుభాష్ కోడలికి ఇచ్చాడు.

తుపాకిని చూసి ముచ్చటపడిన జాన్వి దానితో ఓసారి ఫొటో దిగాలని భావించింది. దానిని పట్టుకుని పోజివ్వగా ఫొటో తీయాలంటూ మేనకోలు డాలీ(13)ని కోరింది. ఫొటో తీసేందుకు డాలీ సిద్ధమవుతుండగా జాన్వి పొరపాటున తుపాకి ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ ఆమె శరీరంలోకి దూసుకుపోయింది. రక్తపు మడుగులో కుప్పకూలిన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్ జాన్వి గుండె దగ్గరగా వెళ్లడంతో ఆమె ఊపిరితిత్తులు పాడైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts