telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లవ్ స్టోరీ” కోసం విలేజ్ సెట్…!

యంగ్ హీరో నాగచైతన్య హీరోగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుంది. కరోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే సినిమా 80 శాతం షూట్ పూర్తయింది. మిగిలిన క్లైమాక్స్ సీన్లను అక్టోబర్ లో పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడట శేఖర్ కమ్ముల. ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని తెలిపే విధంగా లవ్ స్టోరీ సినిమా కథ సాగనుందని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఓ విలేజ్ సెట్ ను వేయిస్తున్నాడట శేఖర్ కమ్ముల. కాగా టాలీవుడ్ ఫీల్ గుడ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ లాంటి హిట్టు సినిమా తర్వాత ఈ సెన్సబుల్ ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు.

Related posts