telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రాన్స్‌జెండర్లకు అండగా శేఖర్ కమ్ముల

sekhar

ట్రాన్స్‌జెండర్స్ ను ఆదుకోవడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుకు వచ్చారు. సమాజంలో పొట్టకూటి కోసం ఇబ్బంది పడే వాళ్లలో ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉన్నారు. వీరికి ఉపాధి కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే వీరికి పనిచ్చేవారు ఉండరు కాబట్టి. ఈ లాక్‌డౌన్ సమయంలో తిండి కోసం ఇబ్బంది పడుతోన్న ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు శేఖర్ కమ్ముల. ఈ విషయాన్ని ఆయన చెప్పలేదు. ఒక ట్రాన్స్‌జెండర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్నవారికి, పేదలకు సేవ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో మరోసారి మీరు నిరూపించారు శేఖర్ కమ్ముల సార్. ఈ లాక్‌డౌన్ రోజుల్లో పనిలేక, డబ్బుల్లేక ఇబ్బందిపడుతోన్న హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు. టాలీవుడ్ నుంచి మరింత మంది మానవత్వాన్ని చాటుకోవాలని కోరుకుంటున్నాం అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లు‌గా ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Related posts