కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.. అయితే…కోవిడ్-19 కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు మూతబడిన సినిమా థియేటర్స్ ఈరోజు నుంచి తెరుచుకుంటున్నాయి. లాక్ డౌన్లో భాగంగా మార్చిలో మూత పడిన థియేటర్లు నేటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. దీంతో కొన్ని సినిమా హాళ్ల వద్ద తిరిగి ప్రేక్షకుల సందడి మొదలైయింది. ఈ క్రమములో దర్శకుడు శేఖర్ కమ్ముల ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
‘ఫైనల్లీ… థియేటర్లకి మేము తిరిగి వచ్చాము… సంతోషంగా, సురక్షితంగా చూడటానికి థియేటర్లకు స్వాగతం అంటూ శేఖర్ కమ్ముల ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవిలతో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. ఏషియన్ సినిమాను ఈ మూవీని నిర్మిస్తోంది. లాక్డౌన్ మొదలు అవ్వకముందే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. ఇక మిగిలిన షూటింగ్ను త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.