telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బోడకొండ వాటర్ ఫాల్స్ దగ్గర “లవ్ స్టోరీ”

అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని తెలిపే విధంగా లవ్ స్టోరీ సినిమా కథ సాగనుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సి.హెచ్. సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు నాలుగు నెలల పాటు తాత్కాలికంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. చకచకా ఈ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా ఈ సినిమా షూటింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ – బోడకొండ వాటర్ ఫాల్ దగ్గర చిత్రీకరణ జరిపారు. చుట్టూ పచ్చటిప్రకృతిసౌందరంతో ఆకట్టుకునే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రయూనిట్ సందడి చేసారు. ఈ సినిమాకు నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు.

Related posts