telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు!

train secunderabad

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుతుందని గత అర్ధరాత్రి ఫోన్‌కాల్ కలకలం రేపింది. స్టేషన్‌లో బాంబు పెట్టామని అది సరిగ్గా అర్ధరాత్రి 12:30 గంటలకు పేలుతుందని పోలీస్ కంట్రరూముకు ఫోన్ రావడంతో గోపాలపురం, సికింద్రాబాద్‌ జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలునిర్వహించారు. అలాగే ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేశారు. ప్రయాణికుల వెయిటింగ్ హాలు, ఫుడ్ స్టాళ్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు జరిపింది. చివరికి బాంబు లేదని తేలడంతో పోలీసులు, ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts