telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మందు కొట్టి ఇద్దరు మహిళలు హల్ చల్!

liquor bottle

సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం సమీపంలో ఇద్దరు మహిళలు మందు కొట్టి హల్ చల్ చేశారు. వారిని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే పోర్టు కార్యాలయం ఎదురుగా తన కారును పార్క్ చేసిన ఓ వ్యక్తి, లోనికి వెళ్లి వచ్చేసరికి ఇద్దరు మహిళలు పూటుగా గుడుంబా తాగి, కారు వద్ద నిలుచున్నారు. ఆపై తమకు పది రూపాయలు ఇవ్వాలని కారు యజమానిని డిమాండ్ చేశారు. తన వద్ద చిల్లర లేదని చెప్పగానే, చెయ్యి పట్టుకుని వేధించావంటూ హంగామా మొదలు పెట్టారు. నలుగురూ వచ్చి చేరేలోపే, కారు అద్దాలను ధ్వంసం చేశారు.

ఆ సమయానికి అక్కడ చేరుకున్న మార్కెట్ పోలీసులు, మహిళలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి, తమ వల్ల కాక, ఆ ప్రాంతం తమ పరిధిలోనిది కాదని తప్పించుకుని వెళ్లిపోయారు. ఆపై జరుగుతున్న హంగామాను ఎవరో పోలీసులకు చేరవేయగా, గోపాలపురం పోలీసులు వచ్చారు. వారు సైతం మహిళలను అదుపులోకి తీసుకోకుండా, వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. తప్పతాగి హంగామా చేసిన వారిని పోలీసులు ఊరికనే వదిలేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

Related posts