సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలు కాజేసిన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.2.2 కోట్లు స్వాహా చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. రైల్వే శాఖలో గతేడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య 31 నకిలీ ఫార్మా బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.ఈ నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణంలో రైల్వే అకౌంట్ అసిస్టెంట్స్ వి. గణేశ్ కుమార్, సాయిబాలాజీపై కేసులు నమోదు చేశారు. అలాగే వినాయక ఏజెన్సీస్, తిరుమల ఎంటర్ ప్రైజెస్పై కూడా కేసు నమోదు చేశారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు: వీహెచ్