తెలంగాణసెక్రెటరియట్ భవనాలను సాంకేతిక కమిటీ ఇవాళ పరిశీలించింది. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోని పది భవనాల నాణ్యత, స్థితిగతులు తదితర అంశాలను కమిటీ పరిశీలించింది. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి సాంకేతిక కమిటీ నివేదిక ఇవ్వనుంది.
సచివాలయం తరలింపు, నూతన సచివాలయ నిర్మాణం, అసెంబ్లీ నూతన భవన నిర్మాణం అంశాలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షుడిగా, మంత్రులు శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుత సచివాలయంభవనాల పరిస్థితిపై అధ్యయనానికి ఇంజినీరింగ్ చీఫ్లతో మంత్రివర్గ ఉపసంఘం సాంకేతిక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.