telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త సచివాలయం డిజైన్‌కు టీఎస్ కబినెట్ ఆమోదముద్ర

KCR cm telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం ప్రగతి భవన్‌లో కొనసాగుతోంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం డిజైన్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు విద్యారంగంపై చర్చ కొనసాగుతోంది. అలాగే ఆయుష్ డాక్టర్ల వయోపరిమితి పెంపు, నియంత్రిత వ్యవసాయ విధానం అమలవుతున్నతీరుపై సమీక్షించనున్నారు.

కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కృష్ణా జలాల అంశం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీ, రిటైల్‌ ట్రేడ్‌, లాజిస్టిక్‌ పాలసీపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.. సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related posts