telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తన ఇంటిలో దోమల మందును చల్లిన కేటీఆర్‌

ktr minister

పరిసరాలను శుభ్రంగా ఉంచితే వ్యాధుల బారిన పడుకుండా ఉండొచ్చని తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన సొంత ఇళ్లలో పారిశుధ్య నిర్వహణ పై దృష్టిసారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన ప్రగతి భవన్‌లో తన ఇంటిని కేటీఆర్‌ స్వయంగా శుభ్రం చేశారు.

ఇంటి ఆవరణలో దోమల మందును చల్లారు. నీటి తొట్లలో గడ్డిని తొలగించి నూనె వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సొంత ఇంటి పారిశుధ్య నిర్వహణ డ్రైవ్‌లో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరు తమ సొంత ఇంటిలోపల.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కేటీఆర్ వెంట నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఉన్నారు.

Related posts