కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. కంటెయిన్మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తొలి రోజు ఉపాధ్యాయులు అందరూ విధులకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. ఆ తర్వాతి రోజు నుంచి ఆన్లైన్ టీచింగ్, టెలి కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు హాజరైతే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది.
కేవలం 9 నుంచి ఇంటర్ చదివే వారు మాత్రం తల్లిదండ్రుల అనుమతితో సందేహాలు నివృత్తి చేసుకునేందుకు స్కూళ్లకు వెళ్లొచ్చు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులను పాఠశాలలకు అనుమతించరు.
రెసిడెన్షియల్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా బోధిస్తారు. అవసరం అనుకుంటే పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల సూచనలు తీసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది.