స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణాల గురించి మంగళవారం కొన్ని కీలక ప్రకటనలు చేసింది. పండుగ సీజన్ సందర్భంగా ఖాతాదారులకు రుణాల్లో రాయితీ కల్పించింది. కారు లోన్ తీసుకునే వారికి తక్కువ వడ్డీకే.. 8.70 శాతం వడ్డీ రేటు నుంచే లోన్ ఇస్తామని ఎస్బీఐ ప్రకటించింది.
అంతేకాదు, రూ.20 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలపై కూడా 10.75 వడ్డీ రేటుతో మొదలుకుని ఆరేళ్ల తిరుగు చెల్లింపు వ్యవధితో లోన్ను అందించనున్నట్లు తెలిపింది. రూ.50 లక్షల దాకా ఎడ్యుకేషన్ లోన్ కూడా 8.25 శాతం వడ్డీ నుంచి మొదలకుని 15 ఏళ్ల తిరుగు చెల్లింపు వ్యవధితో మంజూరు చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది.
జేడీఎస్తో పొత్తుతో నష్టపోయాం..లేకుంటే 16 స్థానాల్లో గెలిచేవాళ్లం: వీరప్ప మొయిలీ