ఎస్బీఐ ఏటీఎంలలో రూ.10 వేలు లేక అంతకంటే కంటే ఎక్కువ డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ నిబంధన రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే ఉండేది. ఇక నుంచి 24 గంటల పాటు ఈ నిబంధన అమల్లోకి రానుంది.
ఈ నెల 18 నుంచి రూ.10వేలు లేక అంతకంటే ఎక్కుడ నగదు తీసుకుంటే డెబిట్ కార్డు పిన్ నంబరునే కాకుండా ఓటీపీని కూడా నమోదు చేయాల్సిందేనని ఎస్బీఐ తెలిపింది.ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు క్రెడిట్ స్కోరు తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఆ బ్యాంకు తెలిపింది.
అమెరికాలో మాదిరిగా పలు అంశాలను తాము కూడా పలు సదుపాయాలు కల్పించాలనుకుంటున్నట్లు చెప్పింది. క్రెడిట్కార్డు ఉన్న వారు వారి ఖాతా నుంచి క్రెడిట్ స్కోరు తెలుసుకునేందుకు ఖాతాలోకి లాగిన్ అయినప్పుడు తెలుసుకోవచ్చని తెలిపింది.
ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుంది: ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి