telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాస్త గ్యాప్ ఇచ్చానంతే : పునర్నవి

punarnavi

‘బిగ్ బాస్’ సీజన్ 3లో పునర్నవికి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమెస్నేహం ‘బిగ్ బాస్’ షోకే ఒక క్రేజ్ తీసుకొచ్చింది. రాహుల్‌ సిప్లిగంజ్‌పై పబ్‌లో బీరు బాటిళ్లతో కొంత మంది దాడిచేయడం చర్చనీయాంశమైంది. ఈ దాడిలో పెద్దవాళ్ల ప్రమేయం ఉండటంతో తనకు న్యాయం చేయాలని రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే, ఈ దాడి జరిగిన తరవాత అందరి కళ్లు పునర్నవిపై పడ్డాయి. ఈ ఘటనతో ఆమెకు ఎలాంటి సంబంధం లేకపోయినా రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఆమెకు ఎలాంటి సంబంధలేదని, అసలు ఆ సమయంలో పునర్నవి అక్కడ లేరని సీసీటీవీ ఫులేజ్‌లు చూస్తే అర్థమైంది. అయితే, తాజాగా పునర్నవి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌తో ఈ రూమర్లకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చింది.రాహుల్ ఘటనపై పునర్నవి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. దానికి కారణం కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే. సుమారు 16 రోజుల విరామం తరవాత మంగళవారం పునర్నవి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తాను ఇన్‌స్టాగ్రామ్ నుంచి కాస్త విరామం తీసుకున్నానని తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పునర్నవి పేర్కొన్నారు. ఈ విరామంలో తానొక పుస్తకాన్ని చదివానని తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తులతో సమయం గడిపానని చెప్పారు.

Related posts