నటి పాయల్ ఘోష్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ వేదికగా ఆ ఆరోపణలన్ని నిరాధారమైనవన్నారు. ఆమె చేసిన ఆరోపణల వలన చాలా మంది నుంచి ఫోన్స్, మెస్సేజ్లు వచ్చినట్టుగా అనురాగ్ కశ్యప్ వెల్లడించాడు. అయితే ఆమె చేసిన ఆరోపణలకి ఎవరు స్పందిన్చావద్దునని చెప్పినప్పటికీ నటి పాయల్ ఘోష్ కి సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా వెల్లడించాడు. “ఒక మహిళ అయిన మీరు.. నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలున్నాయంటూ ఆరోపించడం తప్పుగా అనిపించలేదా?” అంటూ అనురాగ్ కశ్యప్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అనురాగ్ కశ్యప్ కి మద్దతుగా, # మీటూ ఆరోపణలకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి సయాని గుప్తా ట్వీట్ చేసారు.
Worst of human kind seen in the last few months:
1. Appropriating someone’s death for personal vendetta.
2. Appropriating one of the most important movements for political vendetta.#MeToo #IStandwithAnuragKashyap @anuragkashyap72
— Sayani Gupta (@sayanigupta) September 20, 2020
ఆమెతో పాటు నటి తాప్సి కూడా స్పందించారు. తాప్సీ అనురాగ్ను అతిపెద్ద ఫెమినిస్ట్గా ట్యాగ్ చేసి, పెద్ద తెరపై మరింత శక్తివంతమైన, ముఖ్యమైన మహిళా పాత్రలను సృష్టించడానికి అనురాగ్ తిరిగి సెట్లకు రావాలంటూ… అనురాగ్తో ఒక త్రోబాక్ పిక్చర్ను కూడా పోస్ట్ చేసారు. ఇక సుర్వీన్ చావ్లా, టిస్కా చోప్రా, ఇంకా పలువురు ప్రముఖులు సైతం అనురాగ్ కశ్యప్కు మద్దతుగా నిలిచారు.