telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహాత్మ గాంధీ జయంతిపై షారుక్‌ ట్వీట్… హీరోయిన్ ఘాటు రియాక్షన్

Sayani

మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా షారుక్‌ ఖాన్‌ చేసిన ఓ ట్వీట్‌ ‌పై “ఫోర్‌ మోర్‌ షాట్స్”‌ ఫేమ్‌ నటి సయాని గుప్తా ఫైర్ అయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా షారుక్‌ ఖాన్‌ “ఈ సమయంలో మన పిల్లలకు ఒకే ఆదర్శం బోధించాలి. అది ఏంటంటే మంచి, చెడు అన్ని వేళలా పిల్లలు చెడు వినకూడదు.. చూడకూడదు.. మాట్లాడకూడదు. 151వ జయంతి సందర్భంగా గాంధీ విలువలను స్మరించుకోవాలి” అంటూ ట్వీట్‌ చేశారు షారుక్‌ ఖాన్‌. దీనిపై సయాని గుప్తా స్పందిస్తూ “పిల్లలకు మంచి విషయాల గురించి చెప్పండి. సత్యం కోసం మాట్లాడమని గాంధీ మనకు బోధించారు. అణగారిన, దోపిడికి గురైన మన దళిత సోదరులు, సోదరీమణుల గురించి మాట్లాడండి. మీ కళ్లను, నోటిని మూసుకోకండి. సత్యం కోసం మాట్లాడండి” అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. ఇంకేముంది వీరిద్దరి ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Related posts