telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఈ నెల 29 నుంచి హ‌జ్‌యాత్ర‌.. త‌క్కువ సంఖ్య‌లో అనుమ‌తి!

saudi released 95 lakhs to hajj yatra disciple

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సౌదీ అరేబియాలోని ప‌విత్ర న‌గ‌రం మ‌క్కాలో జ‌రిగే ముస్లింల హ‌జ్‌యాత్ర‌కు బ్రేక్ ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే త‌క్కువ సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి ఇస్తూ.. ఈ నెల 29వ తేదీ నుంచి హ‌జ్ యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్నారు. కేవ‌లం వెయ్యి మంది ముస్లిం యాత్రికుల‌కు మాత్రమే హ‌జ్ వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

ప‌విత్ర న‌గ‌రం మ‌క్కాలో జ‌రిగే వేడుక‌ల్లో పాల్గొనేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఏడాది 2.5 మిలియ‌న్ల మంది యాత్రికులు వ‌స్తుంటారు. అయితే ఈ సారి క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో యాత్ర‌లో భక్తుల సంఖ్యనుత‌గ్గించారు. అత్యంత క‌ఠిన‌మైన ఆంక్ష‌ల నడుమ యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు. 65 ఏళ్ల లోపు ఉన్న‌ వారికి మాత్ర‌మే అనుమ‌తి ఇవ్వనున్నారు. హ‌జ్ వేడుక జ‌రిగే మౌంట్ అరాఫత్‌పై యాత్రికుల‌ను ఎక్కువ సంఖ్య‌లో గుమ్మికూడ కుండా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts