జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గోవాకు గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గోవా రాష్ట్ర గవర్నర్గా సత్యపాల్ మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. పనాజీ సమీపంలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ చేత ముంబై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అక్టోబర్ 25న సత్యపాల్ మాలిక్ను గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర గవర్నర్గా సత్యపాల్ మాలిక్ బాధ్యతల్లో ఉన్నారు. ఈనెల 31 వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్, లడక్ లు పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం మాలిక్ తాజాగా గోవా గవర్నర్గా నియమించింది.