ప్రముఖ నటుడు, సీనియర్ నేత శతృఘ్న సిన్హా గత కొంత కాలంగా బీజేపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న విషయం తెలిసిందే. దానిని కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకుంటుంది. ఈ ఎన్నికల్లో ఆయనకు పాట్నా సాహిబ్ నుంచి టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే సిట్టింగ్ స్థానమైన పాట్నా సాహిబ్ నుంచే తాను తిరిగి బరిలోకి దిగనున్నట్టు శతృఘ్న సిన్హా ప్రకటించారు. అయితే, బీజేపీ మాత్రం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ను ఆ స్థానంలో పోటీకి దించాలని భావిస్తోంది. గత కొంతకాలంగా బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సిన్హా ఇటీవల బెంగాల్లో ప్రతిపక్షాలు నిర్వహించిన ఐక్యతా ర్యాలీలోనూ పాల్గొన్నారు.