శర్వానంద్ ఈసారి అభిమానులను సరికొత్తగా ఉత్సాహపరుస్తున్నాడు. ఆయన తాజా చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మరో కొత్త ప్రయోగానికి సిద్ధం అయ్యాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన చేసిన సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, శర్వానంద్ ’96’ మూవీ రీమేక్ లో చేస్తున్నాడు. సమంత జోడీగా ఆయన చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం ‘కెన్యా’లో షూటింగు జరుపుకుంటోంది.
ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా శర్వానంద్ లైన్లో పెట్టేసినట్టుగా సమాచారం. ఇది తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే చిత్రమని చెబుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మితమయ్యే ఈ సినిమా ద్వారా ఒక నూతన దర్శకుడు పరిచయం కానున్నాడని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో వున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.