మరోసారి శర్వానంద్ మాస్ లుక్ లో అలరించడానికి సిద్ధం అయ్యాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ రణరంగం అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శర్వానంద్ ఇటీవల గాయపడడంతో షూటింగ్కి కొద్ది రోజులు బ్రేక్ పడింది. ఆయన కోలుకున్న వెంటనే తిరిగి ప్రారంభించి అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని మేకర్స్ భావిస్తున్నారు.
నేటి సాయంత్రం 4:05కి టీజర్ ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ పోస్టర్లో శర్వానంద్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడని చెబుతున్నారు. శర్వా చేయబోవు రెండు పాత్రలలో ఒకటి యంగ్ ఏజ్ వ్యక్తి కాగా, మరొకటి ముసలి వ్యక్తి అని అంటున్నారు. కాగా, శర్వానంద్ 96 తమిళ రీమేక్లోను నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత కథానాయికగా నటించనుంది.