telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సర్కారు వారి పాట” స్టోరీ అదేనట..!

తెలుగు స్టార్ హీరో మహేష్ దాదాపు ఏడాది తరువాత చేయనున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో సెట్స్‌లో అతిత్వరలోనే జాయిన్ కానున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరీలో మొదలు కానుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం కావలసిన భారీ సెట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మాణం అవుతోంది. ఈ సినిమాలో అత్యదికభాగం అమెరికాలో జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా దానిని వాయిదా వేశారు. అయితే ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో రూపొందనుంది. దాంతో ఈ సినిమాలో కొంత భాగం బ్యాంక్‌లో చిత్రీకరణ జరగనుంది. అందుకోసం బ్యాంక్ సిట్‌లో చిత్రీకరించనున్నారు. ఇక బ్యాంక్ వెలుపలి సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరిచనున్నారు. దీనిని బట్టి ఈ సినిమా బ్యాంక్ కుంభకోణంగా పరుశురామ్ ప్రయేగం చేయనున్నాడు. మరి ఈ కుంభకోణం ప్రజలను ఆకట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. అయితే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాపై అభిమానుల్లో కూడా మంచి టాక్ నడుస్తోంది. ఇందులో మహేష్ లుక్ కోసం ఫాన్స్ పరితిపిస్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యాక మంచి రికార్డులను సాధిస్తుందని అభిమానులు అంటున్నారు.

Related posts