సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 27వ సినిమాగా రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా చేస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాలతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే షూటింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు పరశురామ్. అయితే ఈ మధ్యే ఈ చిత్రబృందం దుబాయ్ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలు, మహేశ్, కీర్తిసురేష్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర యూనిట్. అలాగే అక్కడి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. తమ తదుపరి షెడ్యూల్ యూఎస్ లో ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ కొన్ని కారణాల కారణంగా ఆ ప్లాన్ కాస్త మారి పోయిన సర్కారు వారి పాట టీమ్ మళ్లీ దుబాయ్కు బయలు దెరనున్నారు. ఈనెల 22న మూవీ టీం దుబాయ్కు బయలు దెరనుంది. అక్కడ ఏప్రిల్ 15 వరకు చిత్రీకరణ కొనసాగించనున్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేసారు.
previous post