బిగ్బాస్ 5వ సీజన్ తొలివారంలోనే ఎలిమినేషన్ ఘట్టం ముగిసింది. మొదట నుంచి జెస్సీ ఎలిమినేట్ అవుతాడని అంతా ఊహించినప్పటికీ చివర్లో ఊహించని విధంగా సరయూ పేరు తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే సరయు ఎలిమినేట్ అయింది.
యాంకర్ రవి, కాజల్, జెస్సీ, హమీదా, మానస్, సరయు.. తొలివారం నామినేషన్స్లో ఉండగా.. అనూహ్యంగా సరయు ఎలిమినేట్ అయ్యింది. షో నుంచి బయటకు రాగానే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలిమినేట్ కాగానే వేదికపైనే పలు కాంట్రవర్సీ స్టేట్మెంట్ను ఇచ్చిన సరయు…ఈ క్రమంలో హౌస్లో ఉన్న ఒక్కో కంటెస్టెంటు బండారాన్నంతా బయటపెట్టింది.
ప్రస్తుతం హౌజ్ కెప్టెన్గా ఉన్న సిరి మగ వారిని అడ్డం పెట్టుకొని ఆడుతుదంటూ సంచలన కామెంట్లు చేసింది. ఇక యాంకర్ రవి గురించి మాట్లాడుతూ.. అతను మంచోడిలాగా నీతి సూత్రాలు భోదిస్తాడు కానీ.. అతనిలో విషయే లేదని చెప్పేసింది. వీజే సన్నీకి అసలు క్యారెక్టర్ లేదంటూ అతని ఫొటోను పగలగొట్టేసింది.
అంతటితో ఆగని సరయు షణ్ముఖ్, జశ్వంత్లను చీల్చి చెండాడింది. షణ్ముఖ్ని ఉద్దేశిస్తూ.. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే.. మగాడివి అయితే సింగిల్ ఆడు. లేదంటే గాజులు వేసుకొని మూలన కూర్చో, నేను గాజులు వేసుకున్నా కూడా సింగిల్గానే ఆడతా.. నువ్వు ఆడలేవు కాబట్టి మూలన కూర్చో అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ఇక బిగ్బాస్ హౌజ్లో దమ్మున్న మగాడు ఎవరైనా ఉన్నారంటే అది విశ్వ ఒక్కడే అని చెప్పింది. మరి బిగ్బాస్ షో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు