ఈ నెల 29 నుండి నగరంలోని జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవారి చరిత్రను చెబుతూ ఈ సారి భారీ ఎత్తున సెట్టింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. 29న తెల్లవారు జామున 3 గంటలకు ప్రత్యేక అభిషేకం నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రతి రోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. తొలి రోజు బాల త్రిపుర సుందరీదేవీగా, 30న గాయత్రిదేవీ, అక్టోబర్1న గజలక్ష్మీదేవి, 2న అన్నపూర్ణాదేవి, 3న లలితా దేవీ, 4న రాజరాజేశ్వరి దేవీ, 5న సరస్వతి దేవీ, 6న దుర్గాదేవి, 7న మహిషాసురమర్ధినిగా, 8న పెద్దమ్మతల్లిలా అమ్మవారు దర్శనమిస్తారు. కుంకుమార్చనలు, చంఢీహోమం నిర్వహిస్తారు.
వకీల్ సాబ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు…