telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతి బరిలోంచి తప్పుకుంటున్న స్టార్స్ ?

Tollywood

సంక్రాంతి సమయంలో బాక్సాఫీస్ వేదికగా జరిగే వార్ ప్రతీ ఏడాది ఉండేదే. సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి భారీ సినిమాలన్నీ పోటీ పడుతుంటాయి. పండగ సమయంలో రెండు, మూడు భారీ సినిమాలు విడుదలైనా కలెక్షన్లు బాగానే ఉంటాయని నిర్మాతలు భావిస్తుంటారు. అయితే రాబోయే సంక్రాంతికి మాత్రం పోటీ తీవ్రంగా ఉంటుందని అందరూ అంచనా వేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `అల వైకుంఠపురములో..`, సూపర్ స్టార్ మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు` చిత్రాలు ఒకే రోజున విడుదలవడానికి సిద్ధమయ్యాయి. రెండు సినిమాలూ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి డిసైడ్ అయ్యాయి. . దీంతో రెండు సినిమాల మధ్య భారీ పోటీ తప్పదని, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని విశ్లేషణలు వినిపించాయి. ఓపెనింగ్స్, కలెక్షన్స్ దెబ్బతింటాయని బయ్యర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాల విడుదల తేదీలు మారబోతున్నట్టు తెలుస్తోంది. రెండు సినిమాల విడుదల తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయట. `అల వైకుంఠపురములో..` చిత్రం జనవరి 11వ తేదీన, `సరిలేరునీకెవ్వరు` సినిమా 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట. రెండు భారీ సినిమాల మధ్య రెండ్రోజుల గ్యాప్ రావడం ఇద్దరికీ మేలు చేస్తుందని భావిస్తున్నారు. మారిన విడుదల తేదీల గురించి ఆయా చిత్ర నిర్మాతలు త్వరలో అధికారిక ప్రకటనలు విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Related posts