telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంజయ్ దత్ కు లీగల్ నోటీసులు… వివాదంలో “ప్రస్థానం”

Prasthanam

తెలుగులో సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన “ప్రస్థానం” చిత్రం టాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్‌‌, జాకీ ష్రఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు.. మనీషా కొయిరాలా, చంకీ పాండే, అమైరా దస్తుర్, అలీ ఫజల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దేవా కట్టానే హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంజయ్ దత్ ప్రొడక్షన్స్, ఎన్‌హెచ్ స్టూడియోస్ బ్యానర్లపై మానయత దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 సెప్టెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ అంచనాలు పెంచేసింది. అయితే సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్‌ని విడుదల చేశారు చిత్రబృందం. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా నిర్మాణం విషయంలో సంజయ్ దత్‌కు కొత్త సమస్య మొదలైంది. ఈ సినిమా హక్కులు తమవంటూ షీ మార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాత సంజూ బాబాకు నోటీసులు పంపింది. సినిమా ప్రారంభంలోనే తాము సంజయ్ దత్‌తో ఈ విషయంపై చర్చించామని, అయితే ఆయన పట్టించుకోలేదని సదరు నిర్మాణ సంస్థ తెలియజేసింది. మరి సంజయ్ దత్, డైరెక్టర్ దేవాకట్టా దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts