పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జాల జంట తమ బిడ్డను తీసుకుని లండన్ లో బయటకు వెళ్లింది. వారితో పాటు పాకిస్థాన్ ఓపెనర్ క్రికెటర్ ఇమాముల్ హక్ కూడా ఉన్నాడు. ఇక వీరిని వెంబడించిన ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్, ఇండియాతో కీలకమైన మ్యాచ్ నేపథ్యంలో ప్రాక్టీస్ మానేసిన షోయబ్ షికార్లు చేస్తున్నాడంటూ వార్తను అందించాడు.
ఈ వార్తను చూసిన పాక్ క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రాగా సానియా మండిపడ్డారు. ట్విట్టర్ లో తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఓ బిడ్డ తమతో ఉన్నాడని కూడా చూడకుండా, తమను వీడియో తీశావని సదరు జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అడగకుండా వీడియో తీయడంతో పాటు చెత్త కథనాన్ని జోడించావని ఎద్దేవా చేసింది. మూర్ఖుల బృందం తమ వెంట పడిందని సానియా వ్యాఖ్యానించింది.
సగం గోచీ నువ్వే విప్పుకున్నావ్… నరేష్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు