అప్పుడప్పుడు కొన్ని వార్తలు అందరినీ షాకింగ్కు గురి చేస్తుంటాయి. ఆ వార్తలతో జనాలందరూ ఒక్కసారిగా కంగుతింటారు. అలాంటి వార్తే ఒకటి ఇప్పడు వచ్చింది. ఈ వార్త ఏకంగా అందాల భామ ఐశ్వర్యరాయ్ పైనే కావడం విశేషం. . అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్న ఐష్.. ఆరాధ్య అనే చిన్నారికి జన్మనిచ్చింది. ఐశ్వర్యరాయ్కి ఒక్కతే కూతురు కాగా.. తాను ఐశ్వర్యరాయ్ కొడుకును అంటూ 32 ఏళ్ల సంగీత్కుమార్ అనే వ్యక్తి రచ్చ చేస్తున్నాడు. “నేను ఐశ్వర్యరాయ్కి ఐవీఎఫ్ విధానంలో పుట్టానని… 1967లో నేను ఐష్కు జన్మించగా..అప్పుడు ఆమె వయస్సు 15. నా తండ్రి నన్ను లండన్ నుంచి వైజాగ్కు తీసుకు రాగా.. ఓ రెండేళ్లపాటు ఐష్ తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారు. నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఐష్ సంబంధీకులు నా బర్త్ సర్టిఫికెట్స్ అన్నీ చింపేశారు. ఐశ్వర్యరాయ్కు నేను మొదటి కొడుకును” అంటూ సంగీత్ కుమార్ అనే వ్యక్తి బీటౌన్లో హంగామా సృష్టించాడు. అయితే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనికి మానసిక స్థితి బాగోలేదని చెప్పారు. దీంతో ఈ విషయం అంతటితో ముగిసింది.
previous post
next post